ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా బలగాల బాంబుల వర్షం
- February 25, 2022
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే.ఉక్రెయిన్ మొత్తాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా రెండో రోజు కూడా ఉక్రెయిన్లోని కీలక ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లిన రష్యా బలగాలు దాడులు జరుపుతున్నాయి.ముఖ్యంగా ఉక్రెయిన్ సైనిక స్థావరాలు, ప్రభుత్వ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి.రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా బాంబులతో దాడులు చేస్తోంది.
రాజధానిని స్వాధీనం చేసుకుంటే రష్యా ఆక్రమణ పూర్తయినట్లుగానే భావించవచ్చు.ఈ రోజు ఉదయం నుంచి కీవ్లోని పలు ప్రాంతాల్లో బాంబుల శబ్దాలు వినపడ్డాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అలాగే, కీవ్లోని ఓ అపార్ట్ మెంట్ బిల్డింగ్ దెబ్బతింది.దీంతో అందులోని ముగ్గురు గాయపడ్డారు. భారీ పేలుళ్ల శబ్దాలతో కీవ్ నగర ప్రజలు వణికిపోతున్నారు. పలు అపార్ట్మెంట్లపై బాంబులు పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.ప్రాణ నష్టంపై అధికారులు కూడా అంచనాకు రాలేకపోతున్నారు.
తాజా వార్తలు
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం
- సాహిత్యం సమాజ జాగృతికి శక్తివంతమైన సాధనం: డాక్టర్ నందిని సిధారెడ్డి
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!









