ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా బలగాల బాంబుల వర్షం
- February 25, 2022
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే.ఉక్రెయిన్ మొత్తాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా రెండో రోజు కూడా ఉక్రెయిన్లోని కీలక ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లిన రష్యా బలగాలు దాడులు జరుపుతున్నాయి.ముఖ్యంగా ఉక్రెయిన్ సైనిక స్థావరాలు, ప్రభుత్వ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి.రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా బాంబులతో దాడులు చేస్తోంది.
రాజధానిని స్వాధీనం చేసుకుంటే రష్యా ఆక్రమణ పూర్తయినట్లుగానే భావించవచ్చు.ఈ రోజు ఉదయం నుంచి కీవ్లోని పలు ప్రాంతాల్లో బాంబుల శబ్దాలు వినపడ్డాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అలాగే, కీవ్లోని ఓ అపార్ట్ మెంట్ బిల్డింగ్ దెబ్బతింది.దీంతో అందులోని ముగ్గురు గాయపడ్డారు. భారీ పేలుళ్ల శబ్దాలతో కీవ్ నగర ప్రజలు వణికిపోతున్నారు. పలు అపార్ట్మెంట్లపై బాంబులు పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.ప్రాణ నష్టంపై అధికారులు కూడా అంచనాకు రాలేకపోతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







