ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా బలగాల బాంబుల వర్షం
- February 25, 2022కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే.ఉక్రెయిన్ మొత్తాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా రెండో రోజు కూడా ఉక్రెయిన్లోని కీలక ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లిన రష్యా బలగాలు దాడులు జరుపుతున్నాయి.ముఖ్యంగా ఉక్రెయిన్ సైనిక స్థావరాలు, ప్రభుత్వ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి.రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా బాంబులతో దాడులు చేస్తోంది.
రాజధానిని స్వాధీనం చేసుకుంటే రష్యా ఆక్రమణ పూర్తయినట్లుగానే భావించవచ్చు.ఈ రోజు ఉదయం నుంచి కీవ్లోని పలు ప్రాంతాల్లో బాంబుల శబ్దాలు వినపడ్డాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అలాగే, కీవ్లోని ఓ అపార్ట్ మెంట్ బిల్డింగ్ దెబ్బతింది.దీంతో అందులోని ముగ్గురు గాయపడ్డారు. భారీ పేలుళ్ల శబ్దాలతో కీవ్ నగర ప్రజలు వణికిపోతున్నారు. పలు అపార్ట్మెంట్లపై బాంబులు పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.ప్రాణ నష్టంపై అధికారులు కూడా అంచనాకు రాలేకపోతున్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ