ఉభయ రాష్ట్రాలు పెను ప్రమాదంలో ; కేసీఆర్

- March 31, 2016 , by Maagulf
ఉభయ రాష్ట్రాలు పెను ప్రమాదంలో ; కేసీఆర్

 ఉభయ రాష్ట్రాలు పెను ప్రమాదంలో ఉన్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గురువారం శాసనసభలో సాగునీటి రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నాయని, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు 450 మేరకు కృష్ణా, గోదావరి నదుల మీద బ్యారేజీలు నిర్మించారని తెలిపారు. వాటిపై భారీ భారీ లిఫ్ట్ లు ఏర్పాటు చేశారని చెప్పారు. 35 సంవత్సరాల చరిత్రలో ఒక్క నీరు లేకపోవడం వల్ల సింగూర్ ఎండిపోయిందని, పై నుండి ఒక చుక్క నీరు కూడా శ్రీరాంసాగర్ కు రాలేదన్నారు. నీళ్లు రావాలంటే ఏం చేయాలి ? అనే దానిపై ప్రభుత్వం సుదీర్ఘంగా సమీక్ష జరిపిందని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అడ్డుకుంటున్నాయని, లేనిపోని విషయాలు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com