కువైట్ నేషనల్ డే: శుభాకాంక్షలు తెలిపిన భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
- February 25, 2022
కువైట్: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కువైట్ జాతీయ దినోత్సవం నేపథ్యంలో భారతదేశ ప్రజలందరి తరఫున కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాహ్కి శుభాకాంక్షలు తెలిపారు. కువైట్ ప్రభుత్వం, కువైట్ ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. కువైట్ ప్రజలందరికీ భారత ప్రజల తరఫున శుభాకాంక్షలు అందజేశారు రామ్ నాథ్ కోవింద్. భారత్-కువైట్ మధ్య స్నేహ బంధం మరింతగా వికసించాలని ఈ సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ ఆకాంక్షించారు.భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జై శంకర్ కూడా కువైట్ జాతీయ దినోత్సవం నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు.కువైట్ 60వ జాతీయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







