గ్రేస్ పీరియడ్ నుండి లబ్ధి పొందిన 14 వేల మంది

- March 02, 2022 , by Maagulf
గ్రేస్ పీరియడ్ నుండి లబ్ధి పొందిన 14 వేల మంది

దోహా: ప్రవాసుల స్థితిని సరిదిద్దడానికి ప్రకటించిన గ్రేస్ పీరియడ్ లో ఇప్పటివరకు 28,476 కంటే ఎక్కువ అభ్యర్థనలు వచ్చాయి. గ్రేస్ పీరియడ్‌లో 8,227 మంది తమ స్వదేశాలకు తిరిగి వెళ్లారని, దాదాపు 6,000 మంది వ్యక్తులు తమ పేపర్‌లను క్రమబద్ధీకరించుకుని తమ హోదాను చట్టబద్ధం చేసుకున్నారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరలో పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అక్టోబరు 10, 2021న ఈ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.  గ్రేస్ పీరియడ్ ను మార్చి 31 పొడిగించారు.  కంపెనీ యజమానులు, ప్రవాస కార్మికులు చేసిన ఉల్లంఘనల పరిష్కార మొత్తంలో 50 శాతం తగ్గింపుతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com