విమెన్ ట్రాఫికింగ్: ఇద్దరు బాలికల్ని రక్షించిన అధికారులు

- March 04, 2022 , by Maagulf
విమెన్ ట్రాఫికింగ్: ఇద్దరు బాలికల్ని రక్షించిన అధికారులు

మనామా: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణను పూర్తి చేసింది.ఇద్దరు బాలికల్ని బహ్రెయిన్‌కి రప్పించి, వారితో వ్యభిచారం చేయించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తేల్చింది. నిందితులు, అలాగే బాధితులు ఆసియా జాతీయులని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెడ్ పేర్కొన్నారు. బాధితుల్లో ఒకరి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు, నిందితుడ్ని అరెస్టు చేశారు. నిందితుడు తమను ఓ అపార్టుమెంట్‌లో బంధించినట్లు బాధితులు తెలిపారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వారిని రక్షించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com