ప్రత్యేకమైన వైట్ పాస్‌పోర్టుని ప్రారంభించిన దుబాయ్ ఎక్స్‌పో 2020

- March 05, 2022 , by Maagulf
ప్రత్యేకమైన వైట్ పాస్‌పోర్టుని ప్రారంభించిన దుబాయ్ ఎక్స్‌పో 2020

దుబాయ్: లిమిటెడ్ ఎడిషన్ వైట్ పాస్ పోర్టుని ఎక్స్‌పో 2020 దుబాయ్ ప్రారంభించింది. ఎక్స్‌పో సూపర్ ఫ్యాన్స్‌ కోసం దీన్ని ప్రారంభించారు. 31 మార్చి వరకు ఇది అందుబాటులో వుంటుంది. ప్రస్తుతం వున్న యెల్లో పాస్‌పోర్టు మీద కనీసం 100 స్టాంపులు వున్న ప్రయాణీకులు ఎక్స్‌పో విజిటర్ సెంటర్ వద్ద దాన్ని చూపించి వైట్ పాస్ ‌పోర్ట్ మెమెంటోని ఉచితంగా పొందవచ్చు. సావనీర్ బుక్ ద్వారా ప్రతి పెవిలియన్ వద్ద స్టాంపుల్ని పొందవచ్చు. మొత్తం 200కి పైగా పెవిలియన్లు తమ సొంత స్టాంపుల్ని కలిగి వున్నాయి. స్పెషల్ డేస్ మరియు ఈవెంట్స్ కోసం ఎక్స్‌పో ప్రత్యేకంగా స్టాంపుల్ని విడుదల చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com