రమదాన్ కోసం అంతా సంసిద్ధం
- June 10, 2015
పవిత్ర రమదాన్ మాసం కోసం అన్ని ఏర్పాట్లూ శరవేగంగా జరుగుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్, ప్రజలకు రమదాన్ సందర్భంగా కూరగాయలు, పళ్ళు, చికెన్, మటన్, ఇతర ఆహార పదార్థాల్ని అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకుంటోంది. వివిధ దేశాల నుంచి గొర్రెలు, కోళ్ళను దిగుమతి చేసుకోవడం ద్వారా రమదాన్ మాసంలో ఎక్కడా ఆహార కొరత రాకుండా చూడాలని ప్రభుత్వం, వ్యాపారులను కోరింది.దీనికోసం అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.వివిధ దేశాల నుంచి వేల సంఖ్యలో గొర్రెలను దిగుమతి చేస్తున్నారు.ఇవి కాకుండా కోళ్ళనూ పెద్ద సంఖ్యలో దిగుమతి చేస్తున్నారు. వీటితోపాటు ప్రోజెన్ ఫుడ్ ఐటమ్స్ని కూడా అందుబాటులో ఉంచారు.బహ్రెయిన్ లైవ్ స్టాక్ కంపెనీ అంచనాల మేరకు రోజూ 4,600 గొర్రెలు వినియోగించబడ్తాయి పవిత్ర రమదాన్ మాసంలో బహ్రెయిన్ ఫ్లోర్ మిల్స్ కంపెనీ టన్నుల కొద్దీ ఆహార పదార్థాల్ని బేకరీ వినియోగం కోసం ఉత్పత్తి చేస్తోంది.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







