దొంగతనాల నుంచి ఇంటికి ఇన్స్యూరెన్స్
- April 01, 2016
యూఏఈలో 1 శాతం కంటే తక్కువ ఇళ్ళకే, తమ ఇంట్లోని విలువైన వస్తువులకు సంబంధించిన ఇన్స్యూరెన్స్ ఉందని ఓ ఇన్స్యూరెన్స్ సంస్థ వెల్లడించింది. దొంగతనాల కారణంగా విలువైన వస్తువల్ని కోల్పోతే అది ఆ కుటుంబంపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతాయనీ, అలాంటి సందర్భాల్లో ఇన్స్యురెన్స్ వారికి అండగా నిలుస్తుందని సంస్థ ప్రతినిథులు చెప్పారు. ఇంటిని మాత్రమే కాకుండా, ఇంట్లోని వస్తువుల్ని కూడా ఇన్స్యూర్ చేసుకోవడం మంచిదనీ, ఈ విషయంలో తాము ఎంతగా అవగాహనా కార్యక్రమాలు చేపడ్తున్నా, వినియోగదారులు పెద్దగా పట్టించుకోవడంలేదనీ మెనా రిటైల్, ఖతార్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రెడ్రిక్ బిస్బ్జెర్గ్ చెప్పారు. ఇదిలా ఉండగా, తమ ఇళ్ళు దోపిడీకి గురి కాకుండా, తాము ఇంట్లో లేనప్పుడు సన్నిహితులు, బంధువులు, లేదా సమీపంలో ఉండే స్నేహితుల్ని అప్పుడప్పుడూ తమ ఇంటిని గమనించాల్సిందిగా సూచించాలి. లాక్ చేసే సమయంలో అన్నీ సరిగ్గా చూసుకోవాలి. అలాగే భద్రతా ఏర్పాట్లు ముఖ్యం. ప్రధానంగా ఇంట్లో పనిచేసేవారితో దొంగలు సఖ్యంగా ఉంటారు. పని మనుషుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









