రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారికి క్షమాభిక్ష?

- March 14, 2022 , by Maagulf
రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారికి క్షమాభిక్ష?

కువైట్: రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారి స్టేటస్ ను సర్దుబాటు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని అంతర్గత మంత్రిత్వ శాఖ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీని కోసం కొత్త గ్రేస్ పీరియడ్‌ను తీసుకొచ్చే యోచనలో ఉంది. స్వచ్ఛంధంగా దేశం విడిచి వెళ్లాలనుకునే వారందరికీ ఫైన్ ను మినహాయించడం, మళ్లీ వారు తిరిగి రావడానికి అనుమతించడం లాంటివి కొత్త ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తమ స్టేటస్ ను సర్దుబాటు చేసుకొని దేశంలో ఉండాలనుకునే వారినుంచి మాత్రం ఫైన్ వసూలు చేయాలని భావిస్తోంది. దేశంలో ప్రస్తుతం రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారి సంఖ్య దాదాపు 130,000 గా ఉంటుందని అంచనా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com