మద్య రహిత రాష్ర్టంగా బీహార్...
- April 01, 2016
బీహార్ మద్య రహిత రాష్ర్టంగా కాబోతుంది. బీహార్ ఎన్నికల్లో గెలిచి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నితీష్ కుమార్ ఏప్రిల్ 1 నుంచి దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో నేటి నుంచి బీహార్లో మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. పూర్తి స్థాయిలో కాకుండా పాక్షికంగా మద్య నిషేధం అమలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దేశీయంగా ఉత్పత్తవుతున్న మద్యంతో పాటూ, స్పైస్ లిక్కర్ ను కూడా నిషేధించారు. దీంతో బీహార్ వ్యాప్తంగా 13 లక్షల మద్యం సీసాలను అధికారులు ధ్వంసం చేశారు. ప్రభుత్వ హెచ్చరికను లెక్కచేయకుండా మద్యం అమ్మకాలు చేపడితే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









