Ramadan.. ఆహార నిల్వలపై MoCIIP సమీక్ష
- March 20, 2022
మస్కట్: పవిత్ర రమదాన్ మాసంలో ఆహార వస్తువుల లభ్యత, వాటి ధరల నియంత్రణపై ఉన్నత స్థాయి సమావేశం గురువారం జరిగింది. స్థానిక మార్కెట్లలో ఆహార వస్తువుల లభ్యతను పెంచే లక్ష్యంతో వాణిజ్య, పరిశ్రమ, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MoCIIP) దృష్టి సారించింది. ఈ సమావేశంలో ఆహార భద్రత రంగానికి సంబంధించిన పలు ప్రాధాన్యతాంశాలపై చర్చించారు. ఒమన్ గవర్నరేట్లోని అన్ని మార్కెట్లలో ఉన్న గోధుమ, బియ్యం, కూరగాయలు, నూనెల వంటి ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాక్ పై సమీక్షించింది. ఈ సమావేశానికి వ్యవసాయ, మత్స్య, జలవనరుల శాఖ మంత్రి హెచ్ఈ డాక్టర్ సౌద్ హమూద్ అల్ హబ్సీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో, స్థానిక మార్కెట్లలో ఆహార నిల్వలను పెంచడానికి ప్రోత్సాహకాల ప్యాకేజీని ప్రకటించారు. దిగుమతి చేసుకునే అనేక ఆహార పదార్థాలకు ఉచిత ఫుడ్ రిజర్వ్ స్టోర్లను అందించడంతోపాటు ఒమానీ పోర్టుల ద్వారా దిగుమతులను సులభతరం చేసే పలు చర్యలకు ఆమోదం తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







