Ramadan.. ఆహార నిల్వలపై MoCIIP సమీక్ష
- March 20, 2022
మస్కట్: పవిత్ర రమదాన్ మాసంలో ఆహార వస్తువుల లభ్యత, వాటి ధరల నియంత్రణపై ఉన్నత స్థాయి సమావేశం గురువారం జరిగింది. స్థానిక మార్కెట్లలో ఆహార వస్తువుల లభ్యతను పెంచే లక్ష్యంతో వాణిజ్య, పరిశ్రమ, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MoCIIP) దృష్టి సారించింది. ఈ సమావేశంలో ఆహార భద్రత రంగానికి సంబంధించిన పలు ప్రాధాన్యతాంశాలపై చర్చించారు. ఒమన్ గవర్నరేట్లోని అన్ని మార్కెట్లలో ఉన్న గోధుమ, బియ్యం, కూరగాయలు, నూనెల వంటి ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాక్ పై సమీక్షించింది. ఈ సమావేశానికి వ్యవసాయ, మత్స్య, జలవనరుల శాఖ మంత్రి హెచ్ఈ డాక్టర్ సౌద్ హమూద్ అల్ హబ్సీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో, స్థానిక మార్కెట్లలో ఆహార నిల్వలను పెంచడానికి ప్రోత్సాహకాల ప్యాకేజీని ప్రకటించారు. దిగుమతి చేసుకునే అనేక ఆహార పదార్థాలకు ఉచిత ఫుడ్ రిజర్వ్ స్టోర్లను అందించడంతోపాటు ఒమానీ పోర్టుల ద్వారా దిగుమతులను సులభతరం చేసే పలు చర్యలకు ఆమోదం తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







