గోల్డ్ ఫ్రాడ్.. 12 మంది ఆసియన్ల ముఠా అరెస్ట్
- March 21, 2022
యూఏఈ: నకిలీ బంగారాన్ని అమ్ముతున్న 12 మంది ఆసియన్ల ముఠాను షార్జా పోలీస్ నేర పరిశోధన విభాగం (CID) అరెస్టు చేసింది. షార్జా పోలీస్లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఒమర్ అహ్మద్ అబు అల్ జూద్ కేసు వివరాలను వివరించారు. నిందితులు అమాయకులకు నకిలీ బంగారు కళాఖండాలను(గోల్డ్ పూతపూసిన) అసలువిగా చెప్పి అమ్మడంలో సిద్ధహస్తులన్నారు. పైగా అనుమానం రాకుండా నకిలీ బంగారాన్ని వివిధ నగరాల్లో అమ్మేవారన్నారు. వీరిపై అనేక ఫిర్యాదులు అందాయని, విచారించి నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నేరస్తులు మొదట్లో స్టోర్లను సందర్శించే వ్యక్తులకు తక్కువ ధరలకు మొబైల్ ఫోన్లను విక్రయించేవారన్నారు. ఇదే సమయంలో ఇస్లామిక్ శాసనాలు ఉన్న ఫేక్ బంగారు ముక్కల నమూనాలను తయారు చేయించి తక్కువ ధరలకు అమ్మారని, కొనేలా బాధితులను నిందితులు నమ్మించేవారన్నారు. అనంతరం వీరి మోసాన్ని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. నిందితులను అరెస్ట్ చేశామన్నారు. మోసానికి పాల్పడినట్టు నిందితులు అంగీకరించారని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశామన్నారు. ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని, లైసెన్స్ లేని వ్యక్తుల దగ్గర వస్తువులను కొనవద్దని అబూ అల్ జూద్ ప్రజలకు పిలుపునిచ్చారు. మోసాలకు పాల్పడే వారి సమాచారం తెలిస్తే స్మార్ట్ యాప్, షార్జా పోలీస్ వెబ్సైట్ http://www.shjpolice.gov.ae లేదా హాట్లైన్ 80040 లో ఫిర్యాదు చేయాలని కోరారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







