సౌదీ అరామ్‌కో వాటాదారులకు బోనస్ షేర్లు

- March 21, 2022 , by Maagulf
సౌదీ అరామ్‌కో వాటాదారులకు బోనస్ షేర్లు

సౌదీ: సౌదీ అరేబియా ఆయిల్ కంపెనీ (సౌదీ అరామ్‌కో) తన వాటాదారులకు $4 బిలియన్ల విలువైన బోనస్ షేర్లను మంజూరు చేయనుంది. ఈ మేరకు అసాధారణ జనరల్ అసెంబ్లీకి డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసినట్టు ఆదివారం అరామ్‌కో ప్రకటించింది. ప్రతి వాటాదారుకు ప్రతి పది షేర్లకు ఒక బోనస్ షేర్ జారీ చేయనున్నారు. ఇది 2021 ఆర్థిక ఫలితాల తర్వాత అమలు చేయనున్నారు. కంపెనీ నికర ఆదాయం $110.0 బిలియన్లకు చేరుకుందని నివేదించింది. అరామ్‌కో నాల్గవ త్రైమాసిక డివిడెండ్ $18.8 బిలియన్లుగా ప్రకటించింది. 2022 మొదటి త్రైమాసికంలో చెల్లించనున్నట్లు అరామ్‌కో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com