దొంగతనం కేసులో 10మందికి జైలు శిక్ష, జరిమానా
- March 21, 2022
యూఏఈ: దొంగతనం కేసులో 10 మందికి దుబాయ్ క్రిమినల్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. పది మందీ కలిసి 150,000 దిర్హాములు జరిమానా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. జైలు శిక్ష పూర్తయ్యాకా నిందితుల్ని దేశం నుంచి బహిష్కరిస్తారు. ఓ వాహన నిర్వహణ సంస్థలో పని చేస్తున్న వ్యక్తిని ప్రధాన నిందితునిగా గుర్తించారు. ఓ పెట్రోల్ స్టేషన్లో పని చేస్తున్న తొమ్మిది మంది కార్మికులతో కలిసి అక్రమంగా రీఫిల్ లావాదేవీలు నిర్వహించారు. ఇందుకు గాను ఆ తొమ్మిది మందికి కొంత వాటా చెల్లించేవాడు. కంపెనీ, ఆడిటర్ అనుమానంతో అకౌంట్లు పరిశీలించగా మోసం బయటపడింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ నేరాన్ని గుర్తించారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







