దివంగత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కి పద్మ విభూషణ్ పురస్కారం..
- March 21, 2022
న్యూ ఢిల్లీ: భారత దేశ తొలి సీడీఎస్, దివంగత ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ కు సోమవారం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించారు. హెలికాప్టర్ చాపర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ మరణించిన విషయం తెలిసిందే.
బిపిన్ రావత్ భారత దేశానికి దేశానికి 27 వ ఆర్మీ చీఫ్ గా పనిచేశారు.అదే విధంగా, తొలి సీడీఎస్ గా సేవలు అందించారు.గత ఏడాది డిసెంబరు 8న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారు.ఈ రోజు జరిగిన రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన బిపిన్ కుమార్తెలు కృతిక, తారిణి ఈ గౌరవాన్ని అందుకున్నారు.
దాదాపు 63 మందికి పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. వీరిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.. గులాంనబీ ఆజాద్ ప్రజా వ్యవహారాల విభాగంలో పద్మ భూషణ్ పురస్కారం రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. పారా ఒలంపిక్స్ సిల్వర్ మెడల్ విజేత దేవెంద్ర ఝాజారియా పద్మ భూషన్ పురస్కారం అందుకున్నారు. సైరస్ పూనవల్ల వాణిజ్యం, పరిశ్రమల రంగంలో పద్మ భూషణ్ పురస్కారం అందుకున్నారు. ప్రముఖ దర్శకుడు చంద్ర ప్రకాశ్ కు సినిమా రంగంలో చేసిన సేవకు గాను పద్మ శ్రీ అవార్డును అందజేశారు.
అదే విధంగా, సచ్చిదానంద స్వామీకి పద్మ భూషణ్ పురస్కారం అందజేశారు. ఆయన సాహిత్యం, విద్యా రంగానికి ఎనలేని సేవ చేశారు. హకీ ప్లేయర్ వందన కటారియాకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేశారు. పారాషూటర్ అవని లేఖర కు పద్మశ్రీ ని ప్రదానం చేశారు. యోగాలో రంగంలో విశేష సేవచేసిన స్వామి శివానందకు పద్మశ్రీ పురస్కారాన్ని రామ్ నాథ్ కోవింద్ ప్రదానం చేశారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







