విద్యార్థిని టీచర్ వేధించలేదని నిర్ధారించిన సీసీటీవీ ఫుటేజ్
- March 24, 2022
దోహా: ఓ విద్యార్థిపై టీచర్ వేధింపులకు పాల్పడ్డారనీ, ఈ క్రమంలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయనీ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత అసలు టీచర్, విద్యార్ధిపై దాడి చేయలేదని తేలింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్పష్టతనిచ్చింది. విద్యార్థి కావాలనే ఇదంతా చేసినట్లు విచారణలో అధికారులు నిర్ధారించారు. ఆడుకుంటున్న సమయంలో బాల్ కారణంగా జరిగిన గొడవ వల్ల విద్యార్థుల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే గాయలయ్యాయి. ఇందులో విద్యార్థి తప్పిదమే వున్నట్లు అధికారులు గుర్తించారు. గొడవను ఆపేందుకు టీచర్ ప్రయత్నించి, ఆ విద్యార్థిని గ్రౌండ్ నుంచి క్లాస్ రూమ్కి పంపించేశారు. దీన్ని విద్యార్థి వేరే కోణంలో చూపి, టీచర్ తనపై దాడి చేసినట్లుగా ఫిర్యాదు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- అండమాన్ సెల్యులార్ జైలులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..
- యూజర్లకు UPI ఛార్జీలు ఉండవు.. కేంద్రం మరోసారి క్లారిటీ
- డేటింగ్ యాప్లో పురుషులకు అందంతో వల...రూ.6 కోట్లు వసూళ్లు
- మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం..మూడు దేశాల జెండా రంగుల్లో మెరిసిన సౌదీ ల్యాండ్మార్క్స్
- BRICS వాణిజ్య మంత్రుల సమావేశంలో యూఏఈ..
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్పై ఇరాన్ దాడిని జీసీసీ తీవ్రంగా ఖండించింది
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ చమురు ట్యాంకర్పై క్షిపణి దాడి..బహ్రెయిన్ తీవ్ర ఖండన
- హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి..సిబ్బంది సురక్షితం
- దుబాయ్లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్కు 2.7మిలియన్ కాల్స్..!!







