ఏపీ గవర్నర్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయిన ఎస్టీ కమీషన్ ఛైర్మన్
- March 24, 2022
            విజయవాడ: ఏపీ రాష్ట్ర షెడ్యూల్ తెగల కమీషన్ ఛైర్మన్ కె.రవిబాబు గురువారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. విజయవాడ రాజ్ భవన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో రవిబాబు గవర్నర్ కు కమీషన్ పరిధిలో చేపడుతున్న విభిన్న కార్యక్రమాలను గురించి వివరించారు.రాజ్యాంగ బద్దంగా షెడ్యూల్ తెగలకు అందవలసిన హక్కుల విషయంలో కమీషన్ తగిన పాత్ర పోషిస్తుందన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ షేడ్యూలు తెగలకు ప్రభుత్వ పధకాలు పూర్తిగా చేరేలా బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎస్ టి జనాభా ఎంత అన్న విషయంపై అరా తీసారు.కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టి తెగల సంక్షేమం కోసం విభిన్న పధకాలు అందిస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవటం ద్వారా సమాజంలో అర్ధిక స్వావలంబన సాధించాలని సూచించారు.ఈ సమావేశంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







