ఏపీ గవర్నర్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయిన ఎస్టీ కమీషన్ ఛైర్మన్
- March 24, 2022
విజయవాడ: ఏపీ రాష్ట్ర షెడ్యూల్ తెగల కమీషన్ ఛైర్మన్ కె.రవిబాబు గురువారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. విజయవాడ రాజ్ భవన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో రవిబాబు గవర్నర్ కు కమీషన్ పరిధిలో చేపడుతున్న విభిన్న కార్యక్రమాలను గురించి వివరించారు.రాజ్యాంగ బద్దంగా షెడ్యూల్ తెగలకు అందవలసిన హక్కుల విషయంలో కమీషన్ తగిన పాత్ర పోషిస్తుందన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ షేడ్యూలు తెగలకు ప్రభుత్వ పధకాలు పూర్తిగా చేరేలా బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎస్ టి జనాభా ఎంత అన్న విషయంపై అరా తీసారు.కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టి తెగల సంక్షేమం కోసం విభిన్న పధకాలు అందిస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవటం ద్వారా సమాజంలో అర్ధిక స్వావలంబన సాధించాలని సూచించారు.ఈ సమావేశంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!









