రమదాన్.. మాల్స్ లో అధికారుల తనిఖీలు
- March 25, 2022
బహ్రెయిన్: పరిశ్రమ, వాణిజ్యం, పర్యాటక మంత్రిత్వ శాఖ బహ్రెయిన్లోని అన్ని గవర్నరేట్లలోని వివిధ ఫుడ్ అవుట్లెట్లు, స్టోర్లను తనిఖీ చేసింది. రమదాన్ నెల ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పర్యవేక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. మనామా మార్కెట్లో మూలికలు, సుగంధ ద్రవ్యాల విక్రయాలకు సంబంధించిన దుకాణాలను తనిఖీ విభాగాలు తనిఖీలు చేసినట్లు కంట్రోల్ అండ్ రిసోర్సెస్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అబ్దుల్ అజీజ్ మహ్మద్ అలీ అల్ అష్రఫ్ తెలిపారు. ఉత్పత్తుల నాణ్య, లభ్యత, వాణిజ్య కార్యకలాపాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ తనిఖీల రమదాన్ నెలంతా కొనసాగుతాయన్నారు. పవిత్ర మాసంలో ప్రసిద్ధి చెందిన దుకాణాల్లోనూ తనిఖీలు చేపడతామన్నారు. దుకాణాలు ప్రమోషన్ల నియమాలు, ఉత్పత్తుల నాణ్యతకు కట్టుబడి ఉండాలని, లేదంటే నిబంధనల ప్రకారం ఆయా సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







