‘అజిత్ దోవల్‌’తో ఒమన్ ఫారిన్ మినిస్టర్ భేటీ

- March 26, 2022 , by Maagulf
‘అజిత్ దోవల్‌’తో ఒమన్ ఫారిన్ మినిస్టర్ భేటీ

న్యూఢిల్లీ: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, వ్యూహాత్మక సంబంధాలపై ఈ సందర్భంగా చర్చించారు. సైనిక, భద్రతా సహకారంతో పాటు అంతరిక్ష శాస్త్రాలు, సైబర్ భద్రత, సముద్ర భద్రత, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పెట్టుబడి, సంస్కృతి రంగాలలో సంబంధాలపై కూడా ఇరు వర్గాలు సమీక్షించాయి. ఈ సమావేశంలో భారత్‌లోని ఒమన్ రాయబారి షేక్ హమద్ సైఫ్ అల్ రవాహి, మంత్రి కార్యాలయ విభాగాధిపతి ఖలీద్ హషీల్ అల్ ముస్లాహి, ఒమన్‌లోని భారత రాయబారి అమిత్ నారంగ్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com