రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన 836 మంది అరెస్ట్
- April 08, 2022
కువైట్: జనవరి 1 నుండి మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా 4534 సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ఈ కాలంలో అధికారులు 16,693 ఉల్లంఘనలను నమోదు చేయడంతోపాటు 836 రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అరెస్టు చేశారు. 383 కేసుల్లో పరారీలో ఉన్న వ్యక్తులను కూడా అరెస్టు చేసిన అధికారులు.. 242 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు నెలల్లో 7,406 ప్రమాదాలు నమోదు అయ్యాయి. దీంతోపాటు 617 డ్రగ్స్ సీజ్లు, 42 ఆల్కహాల్ సీజ్ లు నమోదు అయినట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









