రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన 836 మంది అరెస్ట్
- April 08, 2022కువైట్: జనవరి 1 నుండి మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా 4534 సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ఈ కాలంలో అధికారులు 16,693 ఉల్లంఘనలను నమోదు చేయడంతోపాటు 836 రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అరెస్టు చేశారు. 383 కేసుల్లో పరారీలో ఉన్న వ్యక్తులను కూడా అరెస్టు చేసిన అధికారులు.. 242 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు నెలల్లో 7,406 ప్రమాదాలు నమోదు అయ్యాయి. దీంతోపాటు 617 డ్రగ్స్ సీజ్లు, 42 ఆల్కహాల్ సీజ్ లు నమోదు అయినట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం