హైదరాబాద్ లోని పబ్స్, బార్లపై ప్రత్యేక నిఘా
- April 09, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లోని పబ్స్, బార్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఎక్సైజ్ కమిషనర్ పేర్కొన్నారు. పబ్, బార్ల నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్, బార్లు ఇచ్చిన సమయంలో మాత్రమే నడిపించాలన్నారు.డార్క్ రూమ్స్ లో కూడా కెమెరాలు ఉండాలని సూచించారు.నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దుతో పాటు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్లోని పబ్ నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికైనా దారికొస్తే సరి.. లేదంటే కఠిన చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అవసరమైతే పబ్ వ్యవస్థను రద్దు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పబ్ల్లో డ్రగ్స్ వాడొద్దని హెచ్చరించినా మళ్లీ డ్రగ్స్ దొరికాయని చెప్పారు.
ఇకపై డ్రగ్స్తో దందా చేస్తే పీడీ యాక్ట్లు నమోదు చేస్తామంటూ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఇకపై పబ్బుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేయాలని.. ప్రస్తుతం అలా కెమెరాలు లేని పబ్బులను మూసేసి.. కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాతే తిరిగి తెరవాలని ఆదేశించారు. ఇలా ఏర్పాటు చేసిన కెమెరాలన్నింటిని ఎక్సైజ్శాఖకు అనుసంధానించాలన్నారు.
ఎక్సైజ్, పోలీసులు సూచించిన నిబంధనలన్నీ పాటిస్తున్నామని చెప్పారు. ప్రతి పబ్ లో సీసీటీవీ కెమెరాలు, బౌన్సర్లను పెట్టామని తెలిపారు. పబ్ కు వచ్చే వారిని తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నామని చెప్పారు. అనుమానిత వ్యక్తులు వస్తే అధికారులకు సమాచారం అందిస్తున్నామని వెల్లడించారు.
ఒక్కరు చేసిన పనికి అందరిని నిందించడం సరైంది కాదన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు తాము కృషి చేస్తామని చెప్పారు. పబ్ లో కానిస్టేబుల్ ను ఉంచాలని మంత్రిని కోరామని తెలిపారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









