యూఏఈ: భిక్షాటన చేయించినా, చేసినా..Dh100,000 జరిమానా.. 6నెలల జైలు!
- April 15, 2022అబుధాబి:యూఏఈ ప్రభుత్వం భిక్షాటన విషయమై తాజాగా చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై దేశంలో ఎవరైనా బయటి దేశాల వారిని నియమించుకుని(ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని) భిక్షాటన చేయిస్తే 100,000 దిర్హాములు జరిమానాతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ గురువారం వెల్లడించింది.అలాగే భిక్షాటన చేసిన వారికి కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని స్పష్టం చేసింది.ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది.ఫెడరల్ డిక్రీ-లా నం.31 ఆఫ్ 2021లోని ఆర్టికల్ 477 ప్రకారం ఈ జరిమానా, జైలు శిక్షలను అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ గుర్తు చేసింది. ముఖ్యంగా పవిత్ర రమదాన్ మాసంలో దేశంలో భిక్షాటన చేసే వారి పై యూఏఈ ప్రభుత్వం ప్రతియేటా ఉక్కుపాదం మోపుతోంది.ఈ క్రమంలోనే ఇటీవల భారీ సంఖ్యలో బిచ్చగాళ్లను అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14