స్మార్ట్ వెహికిల్ రెంటల్ సర్వీస్ ప్రారంభం
- April 20, 2022
యూఏఈ: 'ఉడ్రైవ్' సహకారంతో ఎమిరేట్ నివాసితులు, సందర్శకుల కోసం స్మార్ట్ వెహికిల్ రెంటల్ సర్వీసును ప్రారంభించినట్లు అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఎమిరేట్ ఆఫ్ అజ్మాన్ నివాసితులు, సందర్శకులు మానవ ప్రమేయం లేకుండా స్మార్ట్ యాప్ ద్వారా వాహనాలను అద్దెకు తీసుకోవచ్చని అథారిటీ స్పష్టం చేసింది. అజ్మాన్ నగరం అంతటా వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. వెహికిల్ అద్దె మొత్తంలో ఇంధనం, పార్కింగ్ టిక్కెట్ ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయోగాత్మక దశలో ప్రజల నుండి ఈ సర్వీసుకు మంచి ఆదరణ లభించిందని కమర్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ CEO అహ్మద్ సఖర్ అల్ మత్రౌషి తెలిపారు. అజ్మాన్ ఎమిరేట్ నివాసితులు, సందర్శకులకు అందుబాటులో ఉన్న మార్గాలలో గంటల చొప్పున వాహనాలను అద్దెకు పొందే అవకాశాన్ని కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. వాహన అద్దె వ్యవస్థ ఎమిరేట్లోని ప్రజా రవాణా వినియోగదారులకు ప్రత్యామ్నాయ ఎంపికగా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









