స్మార్ట్ వెహికిల్ రెంటల్ సర్వీస్ ప్రారంభం
- April 20, 2022
యూఏఈ: 'ఉడ్రైవ్' సహకారంతో ఎమిరేట్ నివాసితులు, సందర్శకుల కోసం స్మార్ట్ వెహికిల్ రెంటల్ సర్వీసును ప్రారంభించినట్లు అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఎమిరేట్ ఆఫ్ అజ్మాన్ నివాసితులు, సందర్శకులు మానవ ప్రమేయం లేకుండా స్మార్ట్ యాప్ ద్వారా వాహనాలను అద్దెకు తీసుకోవచ్చని అథారిటీ స్పష్టం చేసింది. అజ్మాన్ నగరం అంతటా వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. వెహికిల్ అద్దె మొత్తంలో ఇంధనం, పార్కింగ్ టిక్కెట్ ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయోగాత్మక దశలో ప్రజల నుండి ఈ సర్వీసుకు మంచి ఆదరణ లభించిందని కమర్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ CEO అహ్మద్ సఖర్ అల్ మత్రౌషి తెలిపారు. అజ్మాన్ ఎమిరేట్ నివాసితులు, సందర్శకులకు అందుబాటులో ఉన్న మార్గాలలో గంటల చొప్పున వాహనాలను అద్దెకు పొందే అవకాశాన్ని కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. వాహన అద్దె వ్యవస్థ ఎమిరేట్లోని ప్రజా రవాణా వినియోగదారులకు ప్రత్యామ్నాయ ఎంపికగా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి
- తెలంగాణ ప్రజలకు అలెర్ట్..
- ఏపీ హై కోర్ట్: విదేశాలకు వెళ్లిన అర్చకులు గర్భగుడిలోకి వెళ్లకూడదు
- ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
- హోర్ముజ్లో సముద్ర ఉద్రిక్తతల పై 40కి పైగా దేశాలు ఆందోళన..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 చొప్పున గెలిచిన ఐదుగురు..!!
- ప్రాంతీయ పరిణామాలను సమీక్షించిన అమీర్, ఇటలీ పీఎం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 59 రకాల మాదక ద్రవ్యాలు స్వాధీనం..!!
- డ్రోన్ల అమ్మకం, పంపిణీ పై కువైట్ నిషేధం..!!
- మోసపూరిత బీమా కంపెనీలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..!!









