స్మార్ట్ వెహికిల్ రెంటల్ సర్వీస్ ప్రారంభం
- April 20, 2022
యూఏఈ: 'ఉడ్రైవ్' సహకారంతో ఎమిరేట్ నివాసితులు, సందర్శకుల కోసం స్మార్ట్ వెహికిల్ రెంటల్ సర్వీసును ప్రారంభించినట్లు అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఎమిరేట్ ఆఫ్ అజ్మాన్ నివాసితులు, సందర్శకులు మానవ ప్రమేయం లేకుండా స్మార్ట్ యాప్ ద్వారా వాహనాలను అద్దెకు తీసుకోవచ్చని అథారిటీ స్పష్టం చేసింది. అజ్మాన్ నగరం అంతటా వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. వెహికిల్ అద్దె మొత్తంలో ఇంధనం, పార్కింగ్ టిక్కెట్ ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయోగాత్మక దశలో ప్రజల నుండి ఈ సర్వీసుకు మంచి ఆదరణ లభించిందని కమర్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ CEO అహ్మద్ సఖర్ అల్ మత్రౌషి తెలిపారు. అజ్మాన్ ఎమిరేట్ నివాసితులు, సందర్శకులకు అందుబాటులో ఉన్న మార్గాలలో గంటల చొప్పున వాహనాలను అద్దెకు పొందే అవకాశాన్ని కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. వాహన అద్దె వ్యవస్థ ఎమిరేట్లోని ప్రజా రవాణా వినియోగదారులకు ప్రత్యామ్నాయ ఎంపికగా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..







