ప్రముఖ పీడీయాట్రిషన్ డా.లక్ష్మి కాంత్ పూళ్లతో ముఖాముఖి...
- April 24, 2022
ప్ర): చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా..చిన్న పిల్లల్లో గుర్తించడం కష్టం. తమ సమస్య గురించి చెప్పుకోలేని చిన్న పిల్లలు..వారు ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో గుర్తించడమెలా?
జ): చంటి పిల్లల్లో సమస్యలు గుర్తించడంలో ప్రతి తల్లి నిష్ణాతురాలు. నూటికి 80% సమస్యలు తల్లి గుర్తించగలదు. మిగిలిన 20 శాతం ఒక పీడియాట్రిషన్ (పిల్లల వైద్యులు) గుర్తించగలరు.
ప్ర):సాధారణంగా చిన్న పిల్లల్లో వచ్చే అనారోగ్య సమస్యలేంటి?
జ): పిల్లల్లో వచ్చే సాధారణ సమస్యలు ఉదా: అజీర్తి, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు..
ప్ర):ఎలాంటి సమస్యల్ని సాధారణ సమస్యలుగా గుర్తించాలి?
జ):సమస్య చిన్నదైనా వెంటనే పీడియాట్రిషన్ ను కలవడం మంచిది.
ప్ర):తీవ్రమైన అనారోగ్య సమస్యలు చిన్న పిల్లల్లో వున్నట్లు ఎలా గుర్తించగలం?
జ):తీవ్రమైన సమస్యలు గుర్తించటానికి ముఖ్య తార్కాణం పాలు తాగడం మానేయటం,విపరీతమైన పేచీ పెట్టటం, డొక్కలు ఎగురవేస్తూ ఆయాసపడటం, మగతగా ఉండటం మొదలైన లక్షణాలు.
ప్ర):తరచూ జలుబు సంబంధిత సమస్యలతో బాధపడే చిన్నారులకు ఎలాంటి వైద్య చికిత్స అవసరమవుతుంది?
జ):తరచూ జలుబుకు కొన్ని మందులు అవసరం పడతాయి.అలాగే ముఖ్యంగా ఇంట్లో పెద్దలకి జలుబు-దగ్గు ఉన్నప్పుడు వాళ్ళు పిల్లలకి దూరంగా ఉండాలి లేదా మాస్క్ ధరించాలి.
ప్ర):కోవిడ్ ప్రభావం చిన్న పిల్లలపై ఎంత?
జ):అదృష్టవశాత్తూ అనేక కారణాల వల్ల పిల్లలు ఇప్పటివరకూ చాలా తక్కువ సంఖ్యలోనే వ్యాధి బారినపడ్డారు.వైరస్ శరీరంలోకి చేరడానికి, స్పెషల్ రిసెప్టార్లు తక్కువ వ్యక్తీకరణ అందుకు ముఖ్య కారణం.అందులోనూ తక్కువమంది పిల్లలకే తీవ్రమైన లక్షణాలు కనిపించాయి.
--డా.లక్ష్మి కాంత్ పూళ్ల(వై.ఎస్.ఆర్ హాస్పిటల్,నర్సీపట్నం,ఆంధ్రప్రదేశ్)
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







