సౌదీలో దేశీయ విమాన ఛార్జీల్లో మార్పులు!
- April 27, 2022
రియాద్: దేశీయ విమాన ప్రయాణ టిక్కెట్ల ధరలలో మార్పులను ఎదుర్కోవటానికి అనేక చర్యలు తీసుకున్నట్లు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) ప్రకటించింది. ఇటీవల కొన్ని కేటగిరీలో విమాన టిక్కెట్ల ధరల్లో మార్పును గమనించినట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ పేర్కొంది. దేశీయ విమాన టిక్కెట్ల ధరలలో మార్పుల గురించి ప్రచారం అవుతున్న వార్తలను గమనిస్తున్నట్లు తెలిపింది. రాజ్యంలో పౌర విమానయాన రంగాన్ని రెగ్యులేటర్ హోదాలో పరిశీలన చేస్తున్నామని, విమాన కంపెనీల ధరల ప్యాకేజీలను గమనిస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే విమాన రవాణా ధరలను సమీక్షించడంతో పాటు సీట్ల సామర్థ్యంలో పెరుగుదల, విమానాల సంఖ్యపై కూడా దృష్టి సారించినట్లు వెల్లడించింది. ప్రయాణీకులకు తగిన ధరలను నిర్ణయించడం, వాయు రవాణా రంగంలో పోటీతత్వాన్ని పెంచే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు GACA పేర్కొంది. ప్రయాణీకుల హక్కులు, వారి రక్షణకు తమ మొదటి ప్రాధాన్యత కొనసాగుతుందని సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







