పబ్లిక్ ఇష్యూకు ఎల్ఐసీ ఐపీఓ
- May 04, 2022
ముంబై: ఎల్ఐసీ ఐపీఓ పబ్లిక్ ఇష్యూకు వచ్చేసింది. మే9 వరకూ అందుబాటులో ఉంటుండగా.. బుధవారం నుంచే ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఇందులో కొనుగోలు చేసుకునేందుకు రిటైల్ మదుపర్లు, పాలసీదార్లు, తొలిసారి పబ్లిక్ ఇష్యూకు దరఖాస్తు చేసుకుంటున్న వారూ ఆసక్తి కనబరుస్తున్నారు.
వీటి ధర రూ.902 నుంచి రూ.949 వరకూ ఉండొచ్చని ప్రకటించారు.డిస్కౌంట్ ను పాలసీదార్లకు రూ.60 చొప్పున రిటైలర్లు, ఉద్యోగులకు రూ.45 చొప్పున అందజేయనున్నారు.
30 కోట్ల పాలసీదార్లు, 13లక్షల మంది ఏజెంట్లు ఉన్న ఎల్ఐసీకి బీమా ప్రీమియంలో 64శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడిని దృష్టిలో పెట్టుకుని ఐపీఓకి దరఖాస్తు చేస్తే మంచి లాభాలు ఉండొచ్చని, అప్పటి వరకూ ఎదురుచూడాల్సి ఉంటుందని జీసీఎల్ సెక్యూరిటీస్ వైస్ ఛైర్మన్ రవి సింఘాల్ అంటున్నారు.
అయితే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం మే 2, 2022 సోమవారమే ఈ ఐపీఓ అందుబాటులోకి వచ్చింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.5వేల 627.3 కోట్లను ఆర్జించింది.5కోట్ల 92లక్షల 96వేల 853 ఈక్విటీ షేర్ల కోసం యాంకర్ ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకున్నారు.ఒక్కో షేరును రూ.949 వద్ద కొనుగోలు చేశారు.దేశంలోని అన్ని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు, మార్కెట్ నిపుణులు ఎల్ఐసీ ఐపీఓ ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తుండటంతో భారీ అంచనాలే నెలకొన్నాయి.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







