భారత్ కరోనా అప్డేట్

- May 04, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3205 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 31 మంది కరోనా బారిన పడి మరణించారు.అదే సమయంలో మొత్తం 2802 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 19,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 5,23,920 మంది మహమ్మారి బారిన పడి మరణించారు. కాగా, ఇప్పటివరకు మొత్తం 4,25,44,689 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, దేశంలో ఇప్పటివరకు మొత్తం 189,48,01,203 డోసుల వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com