డాల్ఫిన్‌లను పట్టుకున్నందుకు ముగ్గురికి జరిమానా విధించిన బహ్రెయిన్

- May 04, 2022 , by Maagulf
డాల్ఫిన్‌లను పట్టుకున్నందుకు ముగ్గురికి జరిమానా విధించిన బహ్రెయిన్

బహ్రెయిన్: డాల్ఫిన్‌లను పట్టుకున్నందుకు బహ్రెయిన్ ముగ్గురికి జరిమానా విధించింది. దేశంలోని ప్రాదేశిక జలాల్లో అక్రమంగా డాల్ఫిన్‌లను పట్టుకున్నందుకు దోషులుగా తేలిన తర్వాత బహ్రెయిన్ కోర్టు ముగ్గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి BD1,000 చొప్పున జరిమానా విధించింది. ఈ తీర్పును మేజర్ క్రిమినల్ కోర్ట్ ఆమోదించింది. అలాగే ఫిషింగ్‌లో ఉపయోగించిన పడవను జప్తు చేయాలని ఆదేశించింది. పట్టుబడిన డాల్ఫిన్‌లను రక్షించడానికి వీలుగా వాటి సహజ ఆవాసాలకు తరలించాలని కొర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ప్రాదేశిక జలాల్లో డాల్ఫిన్‌లను పట్టుకోవడం బహ్రెయిన్ లో నిషేధం. పర్యావరణం, సహజ సంపదను పరిరక్షించడం అనేది బహ్రెయిన్ రాజ్యాంగంలో ఓ భాగంగా ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com