జాకీచాన్ మైనపు విగ్రహాన్ని సోనూసూద్ ఆవిష్కరించారు
- April 06, 2016రాజస్థాన్ రాజధాని జైపూర్లో మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు, నటుడు అయిన జాకీచాన్ మైనపు విగ్రహాన్ని రూపొందించారు. నహర్గడ్ కోటలో రూపొందించిన ఈ విగ్రహాన్ని నటుడు సోనూసూద్ ఆవిష్కరించారు. ఈ విషయాన్ని సోనూ తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఫొటో పోస్ట్ చేశాడు. జాకీ, సోనూసూద్లు ఇండో-చైనీస్ చిత్రమైన 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం జోధ్పూర్లో జరుగుతోంది. ఇందులో జాకీకి జంటగా బాలీవుడ్ నటి అమైరా దస్తర్ నటిస్తోంది. స్టాన్లీ టాంగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్కు వచ్చినప్పుడు ఇరు దేశాల మధ్య జరిగిన మూడు చిత్రాల ఒప్పందంలో ఒకటి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 22న పదవ తరగతి ఫలితాలు విడుదల
- T20 వరల్డ్కప్.. ఏప్రిల్ 28న భారత జట్టు ఎంపిక..!
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం