జాకీచాన్‌ మైనపు విగ్రహాన్ని సోనూసూద్‌ ఆవిష్కరించారు

- April 06, 2016 , by Maagulf
జాకీచాన్‌ మైనపు విగ్రహాన్ని సోనూసూద్‌ ఆవిష్కరించారు

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణుడు, నటుడు అయిన జాకీచాన్‌ మైనపు విగ్రహాన్ని రూపొందించారు. నహర్‌గడ్‌ కోటలో రూపొందించిన ఈ విగ్రహాన్ని నటుడు సోనూసూద్‌ ఆవిష్కరించారు. ఈ విషయాన్ని సోనూ తన ట్విట్టర్‌ ద్వారా తెలుపుతూ ఫొటో పోస్ట్‌ చేశాడు. జాకీ, సోనూసూద్‌లు ఇండో-చైనీస్‌ చిత్రమైన 'కుంగ్‌ ఫూ యోగా' సినిమాలో నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం జోధ్‌పూర్‌లో జరుగుతోంది. ఇందులో జాకీకి జంటగా బాలీవుడ్‌ నటి అమైరా దస్తర్‌ నటిస్తోంది. స్టాన్లీ టాంగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్‌కు వచ్చినప్పుడు ఇరు దేశాల మధ్య జరిగిన మూడు చిత్రాల ఒప్పందంలో ఒకటి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com