దుబాయ్ లో శివసేన ఎమ్మెల్యే హఠాన్మరణం..
- May 12, 2022
దుబాయ్: దుబాయ్ కు వచ్చిన శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణించారు.కుటుంబంతో కలిసి దుబాయ్ వచ్చిన ఎమ్మెల్యే రమేశ్ లట్కే బుధవారం గుండెపోటుతో మరణించారని శివసేన ఆఫీస్ బేరర్ తెలిపారు.ముంబైలోని అంధేరి ఈస్ట్ నియోజకవర్గం నుంచి రమేశ్ లట్కే రెండుసార్లు శివసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.
2014లో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్టిని ఓడించి..తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు లట్కే. 2019లో స్వతంత్ర అభ్యర్థి ఎం.పటేల్ పై ఘనవిజయం సాధించారు. అంతకుముందు బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్కు(BMC) కార్పొరేటర్గా కూడా పనిచేశారు.ఎమ్మెల్యే మృతి వార్త తెలిసి పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు.ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.రమేశ్ లట్కే మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని,ఇటీవల కొంకణలో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా విమానంలో కలిశారని బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే అన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







