టెహ్రాన్‌లో ఇరాన్ అధ్యక్షుడితో సమావేశమైన అమీర్

- May 13, 2022 , by Maagulf
టెహ్రాన్‌లో ఇరాన్ అధ్యక్షుడితో సమావేశమైన అమీర్

దోహా: టెహ్రాన్‌లోని రిపబ్లికన్ ప్యాలెస్‌లో ఇరాన్ ప్రెసిడెంట్ హెచ్‌ఇ ఇబ్రహీం రైసీతో అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ అధికారిక చర్చలు జరిపారు. పర్యాటకం, పెట్టుబడులు, రవాణా, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంతోపాటు రాజకీయ, ఆర్థిక, వాణిజ్య రంగాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. వీటితోపాటు అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా వీరు చర్చించారు. ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి HE షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్-తానీ, అమిరి దివాన్ చీఫ్ HE షేక్ సౌద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-థానీ, రవాణా మంత్రి HE జాసిమ్ బిన్ సైఫ్ అల్ సులైతి, వాణిజ్య, పరిశ్రమల మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ ఖాసిమ్ అల్-థానీ ఖతార్ తరఫున పాల్గొన్నారు. అలాగే ఇరాన్ తరఫున సెషన్‌లో విదేశాంగ మంత్రి హెచ్‌ఇ హుస్సేన్ అమీర్ అబ్దోల్లాహియాన్, ఇంధన శాఖ మంత్రి అలీ అక్బర్ మెహ్రాబియాన్, రోడ్లు-నగరాల భవనాల మంత్రి హెచ్‌ఇ రోస్తమ్ ఖాస్సేమీ, పరిశ్రమలు, గనుల మంత్రి రెజా ఫాతేమీ ఈ సమావేశంలో పాల్గొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com