డ్రగ్స్ కేసులో దోషికి 10 ఏళ్ళ జైలు శిక్ష

- May 14, 2022 , by Maagulf
డ్రగ్స్ కేసులో దోషికి 10 ఏళ్ళ జైలు శిక్ష

మనామా: డ్రగ్స్ కేసులో దోషికి పదేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. ఇప్పటికే అతనికి జైలు శిక్ష పడగా దాన్ని అప్పీల్స్ కోర్టులో సవాల్ చేయడం జరిగింది. అయితే అప్పీల్ కోర్టు ఆ శిక్షను సమర్థించింది. నిందితుడి నుంచి పెద్దయెత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పక్కా సమాచారంతో నిందితుడ్ని పట్టుకునేందుకు అధికారులు, మారు వేషంలో వెళ్ళారు. డ్రగ్స్ అతని నుంచి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నటు నటించి, అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.  నిందితుడికి న్యాయస్థానం 5000 బహ్రెయినీ దినార్ల జరీమానా కూడా విధించడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com