షేక్ ఖలీఫా మృతి..వాయిదా పడ్డ ఐఫా (IIFA) అవార్డ్స్
- May 15, 2022
అబుధాబి: దివంగత యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతిపై యూఏఈ అంతటా 40 రోజుల సంతాపదినాలు ప్రటకించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అబుధాబి లో జరగాల్సిన IIFA అవార్డుల 22వ ఎడిషన్ వాయిదా వేయాలని ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) తన నిర్ణయాన్ని ప్రకటించింది.
మే 20 మరియు 21 తేదీల్లో జరగాల్సిన ఈ అవార్డుల వేడుక ఇప్పుడు జూలై 14, 15 మరియు 16 తేదీల్లో అబుధాబి లో నిర్వహించబడుతుంది అని అధికారిక ప్రకటన వెలువడింది.
అబుధాబి లో వచ్చే వారం జరగాల్సిన కల్చర్ సమ్మిట్ అబుధాబి 2022 యొక్క ఐదవ ఎడిషన్ కూడా వాయిదా పడినట్టు అబుధాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ తెలిపింది.
అబుధాబి నే కాకుండా దుబాయ్, షార్జా మరియు ఇతర ఎమిరేట్స్లో కూడా షేక్ ఖలీఫా మృతికి సంతాపసూచికంగా అనేక సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి.
తాజా వార్తలు
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్









