యువ ఫుట్బాల్ అభిమానులను కలుసుకున్న పీఎస్జీ ప్లేయర్స్
- May 17, 2022
దోహా: ఖతార్లోని ఎడ్యుకేషన్ సిటీలో పీఎస్జీ అకాడమీ, ఖతార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ స్పోర్ట్ ప్రోగ్రామ్లో భాగంగా పారిస్ సెయింట్-జర్మన్కు చెందిన ఫుట్బాల్ స్టార్ ఫుట్ బాల్ ఆటగాళ్లు యువ ఫుట్బాల్ అభిమానులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో వారు ఇంటరాక్షన్ అయ్యారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఖతార్ ఫౌండేషన్ ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్లో భాగమైన అవ్సాజ్ అకాడమీలో 100 మందికి పైగా పిల్లలు ఫ్రెంచ్ ఫుట్బాల్ ఛాంపియన్లను ప్రశ్నించారు. సెషన్లో భాగంగా ఆటగాళ్ళు ఫుట్బాల్ ఆడటం ప్రారంభించినప్పటి నుండి గ్లోబల్ స్టార్లుగా ఎదిగిన క్రమాన్ని యువ అభిమానులతో పంచుకున్నారు. చిన్నారులతో ఫోటోలు దిగడంతోపాటు వారికి ఆటోగ్రాఫ్లు ఇచ్చి వారిని సంతోషపెట్టారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







