యువ ఫుట్బాల్ అభిమానులను కలుసుకున్న పీఎస్జీ ప్లేయర్స్
- May 17, 2022
దోహా: ఖతార్లోని ఎడ్యుకేషన్ సిటీలో పీఎస్జీ అకాడమీ, ఖతార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ స్పోర్ట్ ప్రోగ్రామ్లో భాగంగా పారిస్ సెయింట్-జర్మన్కు చెందిన ఫుట్బాల్ స్టార్ ఫుట్ బాల్ ఆటగాళ్లు యువ ఫుట్బాల్ అభిమానులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో వారు ఇంటరాక్షన్ అయ్యారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఖతార్ ఫౌండేషన్ ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్లో భాగమైన అవ్సాజ్ అకాడమీలో 100 మందికి పైగా పిల్లలు ఫ్రెంచ్ ఫుట్బాల్ ఛాంపియన్లను ప్రశ్నించారు. సెషన్లో భాగంగా ఆటగాళ్ళు ఫుట్బాల్ ఆడటం ప్రారంభించినప్పటి నుండి గ్లోబల్ స్టార్లుగా ఎదిగిన క్రమాన్ని యువ అభిమానులతో పంచుకున్నారు. చిన్నారులతో ఫోటోలు దిగడంతోపాటు వారికి ఆటోగ్రాఫ్లు ఇచ్చి వారిని సంతోషపెట్టారు.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









