యూఏఈ దివంగత అధ్యక్షుని కోసం ప్రార్థనలు నిర్వహించిన బీఏపీఎస్ హిందూ మందిర్

- May 17, 2022 , by Maagulf
యూఏఈ దివంగత అధ్యక్షుని కోసం ప్రార్థనలు నిర్వహించిన బీఏపీఎస్ హిందూ మందిర్

యూఏఈ: అబుదాబిలోని బీఏపీఎస్ హిందూ మందిర్‌లో యూఏఈ దివంగత అధ్యక్షుని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కోసం ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు.స్వామి బ్రహ్మవిహారిదాస్ హిందూ సమాజం తరపున ప్రార్థనలు నిర్వహించి, తమ సంతాపాన్ని తెలియజేయడానికి రాజ దర్బారును సందర్శించారు. శాంతితో పురోగమనాన్ని, సామరస్యంతో ఆనందాన్ని, జ్ఞానోదయంతో వ్యాపారాన్ని, ఏకత్వంతో వైవిధ్యాన్ని సృష్టించడం - ప్రేమ, శాంతి, సహనంతో జీవన నాణ్యతను పెంపొందించడంలో, ఆయన యావత్ జాతిని ఎలా ప్రేరేపించిందో చెబుతూ యూఏఈ ప్రెసిడెంట్ కు నివాళులర్పించారు.యూఏఈ కాబోయే ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉజ్వలమైన, గొప్ప భవిష్యత్తు వైపు మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.మహంత్ స్వామి మహరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com