యూఏఈ నేతలకు సంతాపం తెలిపిన క్రౌన్ ప్రిన్స్
- May 17, 2022
అబుదాబి: దివంగత షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్-నహ్యాన్ సంతాప సభకు క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్-నహ్యాన్ కుటుంబ సభ్యులకు యువరాజు మహ్మద్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు షేక్ ఖలీఫా మరణంపై సంతాపాన్ని తెలియజేయడానికి క్రౌన్ ప్రిన్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు బయలుదేరారు. ప్రిన్స్ మొహమ్మద్ను అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ షేక్ హజ్జా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రిసివ్ చేసుకున్నారు. జాయెద్ ఛారిటబుల్ అండ్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ యొక్క ట్రస్టీల బోర్డు ఛైర్మన్ షేక్ నహ్యాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యూఏఈ ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యూఏఈ జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితోపాటు యువరాజు అబ్దుల్ అజీజ్ బిన్ అహ్మద్ బిన్ అబ్దులాజీజ్; టర్కీ ప్రిన్స్ బిన్ మొహమ్మద్ బిన్ ఫహద్ బిన్ అబ్దుల్ అజీజ్, రియాద్ రీజియన్ డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, క్రీడల మంత్రి యువరాజు అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్-ఫైసల్, అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ అనేక మంది యువరాజులు, సీనియర్ అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!







