యూఏఈ దివంగత అధ్యక్షుని కోసం ప్రార్థనలు నిర్వహించిన బీఏపీఎస్ హిందూ మందిర్
- May 17, 2022
యూఏఈ: అబుదాబిలోని బీఏపీఎస్ హిందూ మందిర్లో యూఏఈ దివంగత అధ్యక్షుని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కోసం ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు.స్వామి బ్రహ్మవిహారిదాస్ హిందూ సమాజం తరపున ప్రార్థనలు నిర్వహించి, తమ సంతాపాన్ని తెలియజేయడానికి రాజ దర్బారును సందర్శించారు. శాంతితో పురోగమనాన్ని, సామరస్యంతో ఆనందాన్ని, జ్ఞానోదయంతో వ్యాపారాన్ని, ఏకత్వంతో వైవిధ్యాన్ని సృష్టించడం - ప్రేమ, శాంతి, సహనంతో జీవన నాణ్యతను పెంపొందించడంలో, ఆయన యావత్ జాతిని ఎలా ప్రేరేపించిందో చెబుతూ యూఏఈ ప్రెసిడెంట్ కు నివాళులర్పించారు.యూఏఈ కాబోయే ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉజ్వలమైన, గొప్ప భవిష్యత్తు వైపు మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.మహంత్ స్వామి మహరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.


తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







