ఆదివారం వరకు ఇసుక తుపాన్లపై హెచ్చరిక
- May 18, 2022
యూఏఈ: దేశవ్యాప్తంగా దుమ్ము ధూళితో కూడిన తుపాన్లు సంభవించవచ్చునని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. యూఏఈ వ్యాప్తంగా ఈ పరిస్థితులు వుంటాయి. ఇసుక ఎగరి పడుతుంది గనుక, విజిబిలిటీ తక్కువగా వుంటుంది. అరేబియన్ గల్ఫ్ వెస్టర్న్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి కొంత తీవ్రంగా వుండవచ్చు. అబుదాబీని ఇసుక తుపాను చుట్టుముట్టిన దరిమిలా ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఎయిర్ క్వాలిటీ కూడా అబుదాబీలో తక్కువగా వుంది. వాహనాల్ని జాగ్రత్తగా నడపాల్సిందిగా అబుదాబీ పోలీసులు వాహనదారులకు సూచించారు. కాగా, అబుదాబీలో 39 డిగ్రీలు, దుబాయ్లో 37 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







