ఖతార్లో కరెన్సీ మోసానికి పాల్పడిన ఇద్దరు అరెస్టు
- May 20, 2022
దోహా: రసాయనాలను ఉపయోగించి సాధారణ పేపర్ నోట్లను కరెన్సీ (యుఎస్ డాలర్లు)గా మారుస్తామని మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అరెస్టు చేసింది. పక్కా సమాచారంతో నిందితులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద యూఎస్ డాలర్ నోట్లతో సమానమైన పరిమాణంలో ఉన్న నల్ల నోట్లతో పాటు, కొన్ని రసాయన ద్రావణాలు, పౌడర్, మోసానికి ఉపయోగించే ఇతర సాధనాలను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై తదుపరి చర్యలు తీసకునేందుకు వీలుగా వారిని సంబంధిత అధికారులకు అప్పగించారు. ఆర్థిక లావాదేవీలు (కరెన్సీ మార్పిడి) ఆమోదించబడిన ఎక్స్ఛేంజ్ కంపెనీలు, బ్యాంకుల ద్వారా నిర్వహించబడుతున్నాయని, మోసపూరిత ప్రకటనలతో నగదు మార్పిడి సేవలను ప్రోత్సహించే సంస్థలు లేదా వ్యక్తులను నమ్మి మోసపోవద్దని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతి ఒక్కరినీ కోరింది.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







