కేస్ ఫాలో-అప్ సేవను ప్రారంభించిన ఇంటీరియర్ మినిస్ట్రీ
- May 20, 2022
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ వెబ్సైట్ (www.moi.gov.kw)లో కేసుల విచారణలను తెలుసుకునే ఫాలో-అప్ సర్వీస్ (కేస్ ప్రోగ్రెస్) ప్రారంభమైంది. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జనరల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ సమన్వయంతో ఈ సర్వీసును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. తాజా సాంకేతిక అభివృద్ధితో వేగవంతమైన పనితీరు, కచ్చితత్వం, పౌరులు, నివాసితులకు మెరుగైన సౌకర్యాన్ని కల్పించడం లక్ష్యంగా ఈ సర్వీసును ప్రవేశపెట్టినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ అప్లికేషన్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో నమోదైన కేసుల గురించి విచారణలను(37 రకాల దుష్ప్రవర్తన కేసులు) గురించి తెలుసుకోవచ్చని మంత్రిత్వ శాఖ వివరించింది. తమ కేసుల విచారణ స్థాయిని తెలుసుకునేందుకు కువైటీస్ జాతీయత సంఖ్య, నివాసితుల నివాస సంఖ్య అయితే 9 అంకెల సంఖ్యను సంబంధిత ఫీల్డ్ లో నమోదు చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చని పేర్కొంది.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







