యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుంది: టి.గవర్నర్ తమిళి సై
- May 27, 2022
హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కౌంట్డౌన్ పేరుతో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసైతోపాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, క్రికెటర్ మిథాలి రాజ్, సినీ నిర్మాత దిల్ రాజు, మా అధ్యక్షుడు మంచు విష్ణు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లడుతూ..నిత్యజీవితంలో యోగా ఒక భాగంగా మారాలని సూచించారు. నిత్యం యోగా చేయడం వల్ల యవ్వనంగా ఉంటారని.. అనేక శారీరక రుగ్మతల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఇస్లాం దేశాలు కూడా యోగాను ఆదరిస్తున్నాయని చెప్పారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని వెల్లడించారు. కాగా, ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్









