డ్రగ్స్ స్మగ్లింగ్.. 30 ఏళ్ల వ్యక్తికి 15 సంవత్సరాల జైలు
- May 28, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్లోకి డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన 30 ఏళ్ల వ్యక్తికి నాల్గవ హై క్రిమినల్ కోర్ట్ 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీనితోపాటు అతనికి BD10,000 జరిమానా విధించింది. అలాగే అతని జైలు శిక్ష ముగిసిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. సదరు ఆసియా జాతీయుడైన వ్యక్తి హెరాయిన్తో నింపిన 114 క్యాప్సూల్స్ ను కడుపులో దాచుకొని బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వస్తుండగా.. అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వైద్య సిబ్బంది సహాయంతో అతని కడుపు నుండి 858.2 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







