ఇరాక్ను వణికిస్తోన్న ప్రాణాంతక కాంగో ఫీవర్
- May 30, 2022ఇరాక్: కాంగో ఫీవర్తో ఇరాక్ వణుకుతోంది. దేశంలో ఇటీవల ఈ కేసులు భారీగా వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ఈ ఏడాది ఇప్పటి వరకు 19 మంది కాంగో ఫీవర్ బారినపడి మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తున్న ఈ కాంగో ఫీవర్ సోకితే జ్వరం, ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలతో మరణిస్తారు. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు.
నైరో వైరస్ అని పిలిచే క్రిమియన్-కాంగో హోమోరేజిక్ ఫీవర్ అనే రక్తం పీల్చే పేలు ద్వారా కాంగో ఫీవర్ జంతువుల నుంచి మానవులకు సోకుతోంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల మలం, రక్తం, చెమట కణాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇరాక్లో 1979లో తొలిసారి ఈ వైరస్ వెలుగు చూసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కరోనా కారణంగా పశువుల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయకపోవడం, గ్లోబల్ వార్మింగ్ వంటివి ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నట్టు డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..