అల్ మర్కియా స్ట్రీట్ మీదుగా పాదచారుల వంతెన
- June 03, 2022
దోహా: ఉమ్ లేఖ్బా, మదీనాత్ ఖలీఫా నార్త్ మధ్య అల్ మర్కియా స్ట్రీట్ మీదుగా పాదచారుల వంతెనను పబ్లిక్ వర్క్స్ అథారిటీ అష్ఘల్ ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ఉమ్ లేఖ్బా, అల్ ఘర్రాఫా మధ్య అల్ షమల్ రోడ్ క్రింద అండర్ పాస్ను కూడా నిర్మించనున్నారు. ఇది పాదచారుల ప్రయాణాన్ని మెరుగుపరచడం, పరిసరాల్లో నివసించే వారికి, ఆ ప్రాంతంలోని మాల్ కస్టమర్లకు భద్రతను కల్పిస్తుంది. పాదచారుల వంతెన మెటల్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా జూన్ 3న సబా అల్ అహ్మద్ కారిడార్, అల్ షమల్ రోడ్ వైపు దాల్ అల్ హమామ్ ఇంటర్సెక్షన్, ఉమ్ లేఖ్బా ఇంటర్చేంజ్ మధ్య అల్ మార్కియా స్ట్రీట్లో ఎనిమిది గంటలపాటు రహదారిని మూసివేయనున్నారు. ఆ సమయంలో అల్ మార్కియా స్ట్రీట్ నుండి ఉమ్ లేఖ్బా అండర్పాస్, అల్ షమల్ రోడ్ ద్వారా సబా అల్ అహ్మద్ కారిడార్ వైపు వెళ్లే వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి అల్ ఖఫ్జీ స్ట్రీట్, దుహైల్ ఇంటర్ఛేంజ్లను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







