అల్ మర్కియా స్ట్రీట్ మీదుగా పాదచారుల వంతెన
- June 03, 2022
దోహా: ఉమ్ లేఖ్బా, మదీనాత్ ఖలీఫా నార్త్ మధ్య అల్ మర్కియా స్ట్రీట్ మీదుగా పాదచారుల వంతెనను పబ్లిక్ వర్క్స్ అథారిటీ అష్ఘల్ ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ఉమ్ లేఖ్బా, అల్ ఘర్రాఫా మధ్య అల్ షమల్ రోడ్ క్రింద అండర్ పాస్ను కూడా నిర్మించనున్నారు. ఇది పాదచారుల ప్రయాణాన్ని మెరుగుపరచడం, పరిసరాల్లో నివసించే వారికి, ఆ ప్రాంతంలోని మాల్ కస్టమర్లకు భద్రతను కల్పిస్తుంది. పాదచారుల వంతెన మెటల్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా జూన్ 3న సబా అల్ అహ్మద్ కారిడార్, అల్ షమల్ రోడ్ వైపు దాల్ అల్ హమామ్ ఇంటర్సెక్షన్, ఉమ్ లేఖ్బా ఇంటర్చేంజ్ మధ్య అల్ మార్కియా స్ట్రీట్లో ఎనిమిది గంటలపాటు రహదారిని మూసివేయనున్నారు. ఆ సమయంలో అల్ మార్కియా స్ట్రీట్ నుండి ఉమ్ లేఖ్బా అండర్పాస్, అల్ షమల్ రోడ్ ద్వారా సబా అల్ అహ్మద్ కారిడార్ వైపు వెళ్లే వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి అల్ ఖఫ్జీ స్ట్రీట్, దుహైల్ ఇంటర్ఛేంజ్లను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







