కువైట్ నుంచి సురక్షితంగా భారత్కు చేరుకున్న తిరుపతి మహిళ
- June 03, 2022
కువైట్: కువైట్లో వీసా ఏజెంట్ ద్వారా మోసపోయి చిత్రవధను అనుభవించిన తిరుపతికి చెందిన మహిళను కువైట్లోని భారత రాయబార కార్యాలయం రక్షంచింది.తిరుపతికి చెందిన శ్రావణిని కువైట్లోని వీసా ఏజెంట్ బందీగా ఉంచినట్లు ఆమె తన భర్తకు వీడియో సందేశం పంపింది. అందులో ఏజెంట్ తనను గదిలో బంధించి వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. వీడియో క్లిప్ ఆధారంగా.. సదరు మహిళ భర్త స్థానిక మీడియాను ఆశ్రయించాడు. ఆ మీడియా కథనాన్ని చూసిన తర్వాత కువైట్లోని భారత రాయబార కార్యాలయం బాధితురాలిని గుర్తించింది. బుధవారం రాత్రి ఆమెను భారతదేశానికి తిరిగి పంపింది. "శ్రావణి సురక్షితంగా భారతదేశానికి చేరుకుంది. బుధవారం రాత్రి తన భర్తను చేరింది" అని కువైట్లోని భారత రాయబార కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇండియన్ ఎంబసీ ఔట్రీచ్ ప్రోగ్రామ్లో భాగంగా అంబాసిడర్ సిబి జార్జ్ ఇంతకుముందు 12 వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేశారు. భారతీయ కమ్యూనిటీ సభ్యులు ఈ వాట్సాప్ నంబర్లకు ఏదైనా భారతీయ భాషలో వాయిస్ సందేశాన్ని పంపవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీని చేరుకోవడానికి కమ్యూనిటీ సభ్యులు ఈ హెల్ప్ లైన్లను ఉపయోగించుకోవాలని సూచించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







