కువైట్ నుంచి సురక్షితంగా భారత్కు చేరుకున్న తిరుపతి మహిళ
- June 03, 2022
కువైట్: కువైట్లో వీసా ఏజెంట్ ద్వారా మోసపోయి చిత్రవధను అనుభవించిన తిరుపతికి చెందిన మహిళను కువైట్లోని భారత రాయబార కార్యాలయం రక్షంచింది.తిరుపతికి చెందిన శ్రావణిని కువైట్లోని వీసా ఏజెంట్ బందీగా ఉంచినట్లు ఆమె తన భర్తకు వీడియో సందేశం పంపింది. అందులో ఏజెంట్ తనను గదిలో బంధించి వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. వీడియో క్లిప్ ఆధారంగా.. సదరు మహిళ భర్త స్థానిక మీడియాను ఆశ్రయించాడు. ఆ మీడియా కథనాన్ని చూసిన తర్వాత కువైట్లోని భారత రాయబార కార్యాలయం బాధితురాలిని గుర్తించింది. బుధవారం రాత్రి ఆమెను భారతదేశానికి తిరిగి పంపింది. "శ్రావణి సురక్షితంగా భారతదేశానికి చేరుకుంది. బుధవారం రాత్రి తన భర్తను చేరింది" అని కువైట్లోని భారత రాయబార కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇండియన్ ఎంబసీ ఔట్రీచ్ ప్రోగ్రామ్లో భాగంగా అంబాసిడర్ సిబి జార్జ్ ఇంతకుముందు 12 వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేశారు. భారతీయ కమ్యూనిటీ సభ్యులు ఈ వాట్సాప్ నంబర్లకు ఏదైనా భారతీయ భాషలో వాయిస్ సందేశాన్ని పంపవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీని చేరుకోవడానికి కమ్యూనిటీ సభ్యులు ఈ హెల్ప్ లైన్లను ఉపయోగించుకోవాలని సూచించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







