కువైట్ నుంచి సురక్షితంగా భారత్కు చేరుకున్న తిరుపతి మహిళ
- June 03, 2022
కువైట్: కువైట్లో వీసా ఏజెంట్ ద్వారా మోసపోయి చిత్రవధను అనుభవించిన తిరుపతికి చెందిన మహిళను కువైట్లోని భారత రాయబార కార్యాలయం రక్షంచింది.తిరుపతికి చెందిన శ్రావణిని కువైట్లోని వీసా ఏజెంట్ బందీగా ఉంచినట్లు ఆమె తన భర్తకు వీడియో సందేశం పంపింది. అందులో ఏజెంట్ తనను గదిలో బంధించి వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. వీడియో క్లిప్ ఆధారంగా.. సదరు మహిళ భర్త స్థానిక మీడియాను ఆశ్రయించాడు. ఆ మీడియా కథనాన్ని చూసిన తర్వాత కువైట్లోని భారత రాయబార కార్యాలయం బాధితురాలిని గుర్తించింది. బుధవారం రాత్రి ఆమెను భారతదేశానికి తిరిగి పంపింది. "శ్రావణి సురక్షితంగా భారతదేశానికి చేరుకుంది. బుధవారం రాత్రి తన భర్తను చేరింది" అని కువైట్లోని భారత రాయబార కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇండియన్ ఎంబసీ ఔట్రీచ్ ప్రోగ్రామ్లో భాగంగా అంబాసిడర్ సిబి జార్జ్ ఇంతకుముందు 12 వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేశారు. భారతీయ కమ్యూనిటీ సభ్యులు ఈ వాట్సాప్ నంబర్లకు ఏదైనా భారతీయ భాషలో వాయిస్ సందేశాన్ని పంపవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీని చేరుకోవడానికి కమ్యూనిటీ సభ్యులు ఈ హెల్ప్ లైన్లను ఉపయోగించుకోవాలని సూచించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







