భారత్ నుంచి హజ్‌ యాత్రికుల కోసం ప్రత్యేక విమానాలు

- June 03, 2022 , by Maagulf
భారత్ నుంచి హజ్‌ యాత్రికుల కోసం ప్రత్యేక విమానాలు

న్యూ ఢిల్లీ: హజ్‌ యాత్రికుల కోసం భారత్‌, సౌదీ అరేబియా మధ్య జూలై 31 వరకు 37 ప్రత్యేక విమాన సర్వీసులను నడపనున్నట్టు స్పైస్‌జెట్‌ గురువారం తెలిపింది.శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమానాలు జూన్‌ 5-20 మధ్య మదీనాకు బయలుదేరుతాయని ఎయిర్‌లైన్‌ సంస్థ  పేర్కొంది. జెద్దా నుంచి శ్రీనగర్‌కు రిటర్ను ఫ్లైట్లు జూలై 15 నుంచి 31 వరకు ఉంటాయని తెలిపింది.ఈ ఏడాది హజ్‌ విమానాలను నడుపుతున్న ఏకైక భారతీయ ఎయిర్‌లైన్‌ స్పైస్‌జెట్‌ అని సంస్థ పేర్కొంది. స్పైస్‌జెట్‌ గతంలో గయా, శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక హజ్‌ విమానాలను నడిపినట్టు గుర్తు చేసింది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ప్రత్యేక హజ్‌ విమాన సేవలు పునఃప్రారంభంకానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com