అతి పెద్ద ట్యాక్స్ మోసం అలాగే మనీలాండరింగ్ కేసుల్లో సంజయ్ షా అరెస్ట్
- June 03, 2022
దుబాయ్: డికెకె 12 బిలియన్లు (1.7 బిలియన్ డాలర్లు) మేర మోసానికి పాల్పడ్డ కేసులో దుబాయ్ పోలీస్, సంజయ్ షా అనే అనుమానితుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. డెన్మార్క్లో ఈ నేరం జరిగినట్లు అధికారులు తెలిపారు. డానిష్ మరియు ఎమిరేటీ అథారిటీస్ పరస్పరం అవగాహనతో, సమాచారం ఇచ్చిపుచ్చుకుని ఈ కేసులో సంజయ్ షాని అరెస్ట్ చేయడం జరిగింది.అబుధాబి పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి మాట్లాడుతూ, దేశ నాయకత్వం సూచనలతో ప్రపంచ దేశాల్లోని పోలీస్ వ్యవస్థలతో కలిసి యూఏఈ పోలీస్ విభాగం పనిచేస్తోందనీ, ఆయా సందర్భాల్లో పరస్పర సహకారంతో నేరస్తుల్ని పట్టుకోవడం జరుగుతోందని అన్నారు. జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం అత్యంత చాకచక్యంగా ఈ కేసుని డీల్ చేసిందనీ, దుబాయ్ ప్రాసిక్యూషన్తో సమన్వయపరచుకుంటూ ఈ కేసుని డీల్ చేసిన విధానం అద్భుతమని అల్ మర్రి కొనయాడారు. కమ్ - ఎక్స్ ట్రేడింగ్ పేరతో వేలాది అప్లికేషన్లను డానిష్ ట్రెజరీకి పంపారు.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







