ప్రముఖ సినిమాటోగ్రఫర్ జ్ఞానశేఖర్ నిర్మాణంలో త్వరలో రెండో చిత్రం ప్రారంభం !!!
- June 06, 2022
హైదరాబాద్: మనం సినిమాతో నిర్మాతగా మారిన ప్రముఖ సినిమాటోగ్రఫర్ జ్ఞానశేఖర్ త్వరలో తన బ్యానర్ కాళీ ప్రొడక్షన్స్ ద్వారా రెండో సినిమాను ప్రారంభించనున్నారు. గమనం చిత్ర దర్శకురాలు సుజనా రావ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. గమనం చిత్రం విమర్శకుల ప్రసంశలు పొంది మంచి చిత్రంగా నిలిచింది.
జ్ఞానశేఖర్ నిర్మించబోయే నూతన చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఈ మూవీలో నటించే నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.
విఎస్.జ్ఞానశేఖర్ దర్శకుడు క్రిష్ తో కలిసి మణికర్ణిక, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో విద్యుత్ జవాల్ మరియు దర్శకుడు సంకల్ప్ రెడ్డి తో ఐబి 71 చిత్రానికి వర్క్ చేస్తున్నారు అలాగే తమిళ్ లో జయం రవితో ఒక సినిమా చేస్తున్నారు. సెలెక్టెడ్ గా కథ బలం ఉన్న సినిమాలను చేస్తూ వెళుతున్నారు జ్ఞానశేఖర్.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







