పవన్ కళ్యాణ్, నాని కాంబినేషన్లో మల్టీ స్టారర్: అలా సెట్టయ్యిందా.?
- June 08, 2022
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయసిత్తం’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమాని రూపొందించనున్నారు. మల్టీ స్టారర్ మూవీగా రూపొందాల్సిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్తో పాటు, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తాడని ప్రచారం జరిగింది.
కానీ, ఆ ప్లేస్లోకి తాజాగా నాని పేరు వచ్చి చేరింది. అనివార్య కారణాలతో తేజు ఆ సినిమా నుంచి తప్పుకున్నాడట. ఆ ప్లేస్ని నానితో రీప్లేస్ చేయాలనుకుంటున్నారట. కాగా, ఒరిజినల్లో సముద్రఖని పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషించనున్నారు.
తమిళంలో సముద్ర ఖని నటిస్తూ దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. చిన్న సినిమాగా తక్కువ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు వెర్షన్కొచ్చేసరికి పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా కొన్నికీలకమైన మార్పులు చేర్పులు చేయనున్నారట.
వీలైనంత త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించేందుకు ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నాయట. అలాగే, అతి కొద్ది నెలల్లోనే సినిమాని పూర్తి చేసేయాలని అనుకుంటున్నారట. కాగా, గతంలో నాగార్జునతో ‘దేవదాస్’ అనే మల్టీ స్టారర్లో నాని నటించిన సంగతి తెలిసిందే.
ఆ సంగతి అలా వుంటే, నాని ప్రస్తుతం ‘అంటే సుందరానికీ.!’ సినిమా ప్రమోషన్లతో బిజీగా వున్నాడు. ఈ నెల 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ విచ్చేస్తుండడం విశేషం.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







