త్రివిక్రమ్-మహేష్ సినిమాలో రకుల్.?
- June 08, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తోంది. కాగా, ఈ సినిమాలో మరో హీరోయిన్ కోసం వేట మొదలెట్టారట. అంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లా.? అనే డౌటానుమానం రావచ్చు.
త్రివిక్రమ్ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లకు చోటుంటుంది. సెకండ్ హీరోయిన్కి అంతగా నిడివి లేకపోయినా, వున్నంతలో ప్రాధాన్యత ఆపాదిస్తూ వుంటాడు ఆ పాత్రకి త్రివిక్రమ్. ఆయన గత చిత్రాల్లో ప్రణీత, ఈషా రెబ్బ, నివేదా పేతురాజ్ తదితర ముద్దుగుమ్మలు అలా దక్కించుకున్న బంపర్ ఛాన్స్ని సద్వినియోగం చేసుకున్నారు.
ఇక ఇప్పుడు మహేష్ సినిమా కోసం ఆ ఛాన్స్ ఎవరిని వరించనుందన్న కోణంలో పలువురు హీరోయిన్లను పరిశీలించారట. కానీ, రకుల్ ప్రీత్ సింగ్ ఆ పాత్రకు సెట్ అయినట్లు తాజాగా అందుతోన్న సమాచారం. చాలా తక్కువ నిడివి వున్న పాత్రట. అయితే, కాస్త స్సైసీగా, ఇంకాస్త స్టైలిష్గా వుండబోతోందట ఆ పాత్ర.
గతంలో రకుల్ ప్రీత్ సింగ్, మహేష్ బాబుతో ‘స్పైడర్’ మూవీలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాల్ని అందుకోలేక పోయింది. అలా రకుల్, మహేష్ కాంబినేషన్ వేస్ట్ అయ్యింది అప్పుడు.
కానీ, త్రివిక్రమ్ సినిమాల్లో ఏ పాత్ర వృథాగా పోదు. నిడివితో సంబంధం లేకుండా హైలైట్ అవుతూ వుంటాయ్ కొన్ని పాత్రలయితే. అలాగే, రకుల్ పాత్ర ఈ సినిమాలో హైలైట్ అవుతుందేమో చూడాలి. మరోవైపు రకుల్ ప్రీత్ ప్రస్తుతం బాలీవుడలో వరుస సినిమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







